విషాదం.. కృష్ణానదిలో గల్లంతయిన ముగ్గురి మృతి

కృష్ణా జిల్లా చోడవరంలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2023-03-04 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా చోడవరంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. నదిలో గల్లంతయిన ముగ్గురి మృతదేహాలను అధికారులు గజఈతగాళ్ల సహయంతో వెలికితీశారు. ఈతకు వెళ్లిన ముగ్గురు మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. నది ఒడ్డున స్కార్పియో కారును గ్రామస్తులు గుర్తించారు. కారు విజయవాడకు చెందిన అబ్దుల్ అలీంకు చెందినదిగా గుర్తించారు. స్పాట్ లో మద్యం సీసాలు, బట్టలు, సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. 

Tags:    

Similar News