తిరుపతిలో ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంక్ ఢీకొని ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ధర్మపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-03-12 05:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా ధర్మపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఆయిల్ ట్యాంకర్- కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను చెన్నైగా చెందిన వారిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News