తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి..

తాడిచెట్టు పై నుంచి కాలుజారి కింద పడ్డగీత కార్మికుడు.. మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది.

Update: 2023-04-09 16:48 GMT

దిశ, మఠంపల్లి : తాడిచెట్టు పై నుంచి కాలుజారి కింద పడ్డగీత కార్మికుడు.. మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చౌటపల్లి గ్రామానికి చెందిన ఐతగాని జానయ్య గౌడ్ (40) సంవత్సరాలు.. ఎప్పటిలాగే కళ్ళు గీసేందుకు తాళ్ళకు వెళ్ళిన తన నడుముకు ఉన్న మూకు జారడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు కోడలు ఉన్నారు.

Tags:    

Similar News