నాలుగేళ్ల చిన్నారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి..

హనుమకొండ జిల్లా కాజిపేట్ మండలంలోని తరాలపల్లి గ్రామంలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవతో తల్లి అనిత (26) మనస్థాపం చెంది నాలుగేళ్ల పాపను చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2023-04-19 15:38 GMT

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా కాజిపేట్ మండలంలోని తరాలపల్లి గ్రామంలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవతో తల్లి అనిత (26) మనస్థాపం చెంది నాలుగేళ్ల పాపను చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భర్త, అత్త, మామ అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని తెలిపారు. దీంతో మృతురాలు అనిత జీవితం పై విసుగుచెంది పాపను చంపి, తాను ఆత్మహత్య చేసుకుందని, మడికొండ పరిధిలోని పోలీస్ స్టేషన్ సీఐ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News