నేడు బెంగాల్‌‌లో అమిత్ షా పర్యటన

by  |
నేడు బెంగాల్‌‌లో అమిత్ షా పర్యటన
X

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం పర్యటించనున్నారు. మొత్తం ఆరు నియోజక వర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొదట ఆయన మధ్యాహ్నం 12.20 గంలకు శాంతి పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి రానాఘాట్‌లో జరిగే మరో రోడ్ షోకు వెళతారు. అనంతరం అక్కడి నుంచి బసిర్ హాత్ దక్షిణ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పానీహతీ, కామర్ హతీ రోడ్ షోలో పాల్గొంటారు. చివరగా రాజర్హత్ గోపాల్ పూర్ ప్రాంతంలో బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు.

Next Story