శ్రీశైలం చేరుకున్న హోం మంత్రి అమిత్ షా

by  |
శ్రీశైలం చేరుకున్న హోం మంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీశైలం సున్నిపెంట‌ హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Next Story

Most Viewed