ఈసీ నిర్ణయం వెనుక కుట్ర !

by  |
ఈసీ నిర్ణయం వెనుక కుట్ర !
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎస్‌ఈసీని ఓ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహార శైలి ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఎస్ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదని అన్నారు. ఎన్నికలు జరగాలని మేమూ కోరుకుంటున్నామని, కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈరోజు అన్ని పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించిందని.. కానీ మేం నిన్ననే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈసీ నిర్ణయం వెనుక కుట్ర ఉందని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైద్య, ఆరోగ్య అధికారులతో మాట్లాడలేదన్నారు. వన్ టు వన్ పిలుపులు నిమ్మగడ్డ – చంద్రబాబు రాజకీయంలో భాగమేనని వ్యాఖ్యానించారు.

Next Story