- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: దేశీయంగా ఈ ఏడాది పండుగ సీజన్ కోసం దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా అమెజాన్ ఇండియా ప్రధానంగా స్మార్ట్ఫోన్లపై భారీగా తగ్గింపులను, ఆఫర్లను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం శాంసంగ్, యాపిల్, వన్ప్లస్ సహా పలు స్మార్ట్ఫోన్ మోడళ్లపై భారీ తగ్గింపులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
తాజాగా, దీనికి సంబంధించి అమెజాన్ సంస్థ వివరాలను వెల్లడించింది. ఇందులో ప్రత్యేకంగా ఐఫోన్ 11 మోడల్ను రూ. 40 వేల కంటే తక్కువకే ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇక, శాంసంగ్కు చెందిన ప్రత్యేక ఎడిషన్ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ఫోన్ను అనూహ్యంగా రూ. 70 వేల నుంచి రూ. 37 వేలకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఇవికాకుండా వన్ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లపై కూడా భారీగా తగ్గింపును అమెజాన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. వన్ప్లస్ 9ఆర్ 5జీ స్మార్ట్ఫోన్ను రూ. 37 వేలకే కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఇక, రెడ్మీ 9ఆర్ను రూ. 7,920కి ఇవ్వనుంది. అంతేకాకుండా పండుగ సీజన్ కోసం ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై బ్యాంకు ఆఫర్లను కూడా ఇవ్వనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.