అమరావతి మహిళా జేఏసీ నేతలు అరెస్ట్

by  |
అమరావతి మహిళా జేఏసీ నేతలు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: కౌలు డబ్బుల కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన అమరావతి రైతులను బలవంతంగా అరెస్ట్ చేయడంపై అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా బుధవారం విజయవాడలో సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చిన సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ జేఏసీ సభ్యులను అరెస్ట్ చేసి సింగ్ నగర్ స్టేషన్ కి తరలించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా భోజనం చేయకుండా స్టేషన్ ఆవరణలోనే జేఏసీ నేతలు నిరసన తెలుపుతున్నారు.



Next Story

Most Viewed