- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా రికార్డుల మోత మోగించింది. తెలుగు ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమాతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఈ సక్సెస్ను ఫుల్గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వెంటనే సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ సినిమా ప్రకటించాడు. కానీ లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ఫ్లోర్ మీదకు వెళ్లలేదు.
త్వరలో షూటింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణ జరగాల్సి ఉంది. దీంతో ముందుగా ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ జరుపుతారని వార్తలు రాగా.. తాజాగా పుష్ప గురించి మరో అప్డేట్ వచ్చింది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ ముందుగా కేరళలో ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని.. తూర్పుగోదావరి ఏరియాలో చేద్దామనుకున్నారు. కానీ ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో సెట్ వేసి షూటింగ్ జరిపేందుకు డిసైడ్ అయిందట మూవీ యూనిట్. చాలా వరకు షూటింగ్ ఇక్కడే కంప్లీట్ చేసి.. కీలక సన్నివేశాలు మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొనగానే అడవిలోనే షూట్ చేస్తారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది.