అల్లు అర్జున్ ఖాతాలో మరో పాన్ఇండియా మూవీ

by  |
అల్లు అర్జున్ ఖాతాలో మరో పాన్ఇండియా మూవీ
X

కరోనా వైరస్ విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ విధించడంతో సినీ తారలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రభుత్వం ఈ మధ్యనే మళ్లీ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే పలు సినిమాలకు ఓకే హీరో, హీరోయిన్లు అందరూ మళ్లీ షూటింగ్‌‌లతో బిజీ కానున్నారు. ఇప్పటికే హీరోలందరూ వరుస కథలకు ఓకే చెప్పి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అలా వైకుంఠపురంలో సక్సెస్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలించింది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. లాక్‌డౌన్ మూలంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్.. సెన్సెషనల్ దర్శకుడు కొరటాల శివతో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొరటాల శివ.. అల్లు అర్జున్‌ను కలిసి కథను నేరేట్ చేసాడట. దానికి అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ సినిమాను కూడా కొరటాల శివ తనదైన సామాజిక అంశానికి కమర్షియల్ విలువలు జోడించి తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ, అల్లు అర్జున్ ఇద్దరు ఇప్పటికే వాళ్లు ఒప్పుకున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

Next Story

Most Viewed