వలస కూలీలు.. ఆందోళన వద్దు

by Chintha Aamani |   (  Updated:2020-04-23 03:31:12  IST  )

<p>దిశ, ఆదిలాబాద్: వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణ శివార్లలో ఉంటున్న ఒరిస్సా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వలస కార్మికుడికి 12 కిలోల బియ్యం, రూ.500 పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 150 మంది వలస [&hellip;]</p>

వలస కూలీలు.. ఆందోళన వద్దు
X

దిశ, ఆదిలాబాద్: వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణ శివార్లలో ఉంటున్న ఒరిస్సా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వలస కార్మికుడికి 12 కిలోల బియ్యం, రూ.500 పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 150 మంది వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు పాల్గొన్నారు.

Tags: Migrant workers, daily needs, minister allola, nirmal, ts news

Next Story