షీ టీమ్ ఇన్‌స్పెక్టర్‌పై భూ కబ్జా ఆరోపణలు

by  |
షీ టీమ్ ఇన్‌స్పెక్టర్‌పై భూ కబ్జా ఆరోపణలు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మాదాపూర్ షీ టీమ్ ఇన్‌స్పెక్టర్ సునీతపై వరంగల్ జిల్లాకు చెందిన రైతు హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్‌ గుట్టల బేగంపేటలో సుమారు రూ.3కోట్ల విలువైన 200 చదరపు గజాల స్థలాన్ని ఇన్‌స్పెక్టర్ సునీత ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బెదిరింపులకు పాల్పడిందని రైతు వాపోయాడు. ప్రస్తుతం డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామన్న ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్…. అక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇన్‌స్పెక్టర్ సునీత గతంలో భూ వివాదాల్లో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed