స్కూల్స్, కాలేజీలు, అంగన్ వాడీలు బంద్..

by  |
స్కూల్స్, కాలేజీలు, అంగన్ వాడీలు బంద్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు, అంగన్ వాడీలను మూసివేస్తున్నట్టు మంత్రి రవీంద్ర చౌబే తెలిపారు. అయితే చత్తీస్‌ఘడ్‌లో ఫిబ్రవరి 15వ తేదీ నుండి 9-12వ తరగతి విద్యార్ధులకు భౌతికంగా తరగతులు ప్రారంభం అయ్యాయి.

ఈ నేపథ్యంలో విద్యార్ధులు కరోనా బారిన పడకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అయితే ప్రజలందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని హెచ్చరించారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

Next Story