మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

by  |
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, షాపింగ్స్‌మాల్స్‌ను మూసి వేసింది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి నుంచి మార్చి 31 వరకు అన్ని కార్యాలయాలు మూసి ఉంచనున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ముంబై, ఎంఎంఆర్ రీజియన్, పుణె, పింప్రి చిన్చ్వాడ్, నాగ‌పూర్‌లలో ఇది వర్తిస్తుందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం హాజరుతో పనిచేస్తాయని తెలిపారు.
tags : All offices closed, until March 31, mumbai, pune, nagapur, maharashtra cm uddav takharey


Next Story

Most Viewed