చికెన్, మటన్ షాపులు, మార్కెట్లు బంద్

by  |
చికెన్, మటన్ షాపులు, మార్కెట్లు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆంక్షలు విధించారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం చికెన్, మటన్ షాపులు, చేపల మార్కెట్లను శనివారం రోజున మూసివేయాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించిన కారణంగా శనివారం రోజున మార్కెట్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే తమిళనాడులోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వం ఈ-పాస్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed