అలియా సినిమాకు తప్పని సెగ

by  |
అలియా సినిమాకు తప్పని సెగ
X

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘సడక్ 2’ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత ముఖేష్ భట్. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన సడక్ చిత్రానికి ఇది సీక్వెల్ కాగా.. మరో రెండు రోజుల షూటింగ్ మిగిలే ఉందట. వచ్చే నెలలో చిత్రీకరణ పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాత ముఖేష్.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెస్ట్..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇదే సరైన దారి అనిపించిందన్న ఆయన.. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే.. ఒకవేళ థియేటర్లు తెరిచినా సరే ఇప్పుడప్పుడే జనాలు సినిమా హాల్స్‌కు వచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే ప్రజలు వారి కుటుంబాలను కాపాడుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. థియేటర్ యజమానులు నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. అంతేకానీ నిర్మాతలను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటే అర్థం.. థియేటర్లు మొత్తమే మూతపడ్డాయని కాదు, ఇది తాత్కాలికమేనని చెప్పాడు ముఖేష్ భట్. ఈ సమయంలో ఒకరినొకరు విమర్శించకుండా.. హెల్ప్ చేసుకోవాలని సూచించారు. అయితే ఎప్పుడూ రిలీజ్ చేస్తారు? ఏ ఓటీటీలో విడుదల చేస్తారు? అనే విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

‘సడక్ 2’ బాయ్‌కాట్ ట్రెండ్..

అయితే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గురించి అలియా తక్కువ చేసి మాట్లాడిందని.. బాలీవుడ్‌లో నెపోటిజం వల్లే సుశాంత్ చనిపోయారని ఆగ్రహం మీదున్న అభిమానులు.. అలియా ‘సడక్ 2’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పూజా భట్, ఆదిత్యరాయ్ కపూర్, జిషు సేన్ గుప్తా, గుల్షన్ గ్రోవర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Next Story

Most Viewed