రణ్‌బీర్‌తో అదే మరిచిపోలేని మూమెంట్ : అలియా

by  |
రణ్‌బీర్‌తో అదే మరిచిపోలేని మూమెంట్ : అలియా
X

దిశ, సినిమా :బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హిందీలో అత్యంత బిజీయెస్ట్ యాక్ట్రెస్‌గా మారిపోయింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్న ఈ బబ్లీ గర్ల్.. ఇప్పటికే ‘ఉడ్తా పంజాబ్, రాజీ, హైవే’ వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది. మరోవైపు సోనమ్ కపూర్‌తో ‘సావరియా’ చిత్రం ద్వారా బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్ సైతం ‘రాక్‌స్టార్, తమాషా, బర్ఫి’ చిత్రాలతో అదరగొట్టగా.. చివరగా సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’తో భారీ హిట్ అందుకున్నాడు.

అయితే వీరిద్దరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకుంది అలియా. 2019లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో తన యూట్యూబ్ చానల్‌లో ఫ్యాన్స్‌తో చాట్ సెషన్ నిర్వహించిన అలియా.. ఆ సంవత్సరంలో తనకు అత్యంత మెమొరబుల్ డే ఏదన్న ఫ్యాన్ ప్రశ్నకు హార్ట్‌ఫుల్ ఆన్సర్ ఇచ్చింది. ‘గుర్తుండిపోయే సంఘటనలు చాలానే ఉన్నా.. నేను, రణ్‌బీర్ ఒకేసారి ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకోవడం చాలా స్పెషల్ మూమెంట్. మేం ఇద్దరం స్టేజ్‌పై ఉన్పప్పుడు చుట్టూ కెమెరాలు క్లిక్ మనడం మరపురాని క్షణం. అలాంటి క్షణం కోసం ఎదురుచూశా. అది నిజంగానే సాకారమైంది’ అని చెప్పుకొచ్చింది.

ఇక సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో అలియా నటించిన ‘గంగుభాయి కతియావాడి’ రిలీజ్ కావాల్సి ఉండగా.. రణ్‌బీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story

Most Viewed