ఆలియా బిజినెస్.. కొత్తగా కిడ్స్ వేర్ బ్రాండ్‌

by  |
Aliya Bhatt
X

దిశ, వెబ్‌డెస్క్ :బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ వ్యాపారవేత్తగా మారిపోయింది. లాస్ట్ ఇయర్ రూ. 59.21 కోట్ల వార్షిక ఆదాయంతో ఫోర్బ్స్ ఇండియా లిస్ట్‌లో చేరిన తను.. లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ఓన్ బ్రాండ్‌ను అనౌన్స్ చేసింది. ‘ఎడ- ఎ- మమ్మ’ పేరుతో కిడ్స్‌వేర్ బ్రాండ్ స్పెషాలిటీస్ గురించి వివరించిన ఆలియా.. రెండేళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల వరకు డ్రెస్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. చిన్నారులకు ఎలాంటి హాని కలగకుండా పూర్తి సహజంగా దుస్తులు తయారు చేశామన్న ఆలియా.. బటన్స్ కూడా నేచురల్ అని, ప్లాస్టిక్ మేడ్ లేదని చెప్పింది.

ఈ న్యూ బ్రాండ్ ప్రొడక్ట్స్.. ఆన్‌లైన్ బేబీ ప్రొడక్ట్స్ స్టోర్ ‘ఫస్ట్ క్రై’లో అందుబాటులో ఉండగా.. రూ. 350 నుంచి ధరలు ప్రారంభమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు వివరించింది ఆలియా. ఫ్యూచర్‌లో ‘ఎడ – ఎ- మమ్మ’ చిల్డ్రన్ బుక్స్, టాయ్స్ కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ క్రమంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్రాండ్ ప్రమోషనల్ వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఆలియా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ‘గంగుభాయి కథియావాడి’ సెట్స్‌లో ఉన్న ఆలియా.. త్వరలో జక్కన్న డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో జాయిన్ కానుంది.

Next Story

Most Viewed