మందుకు డబ్బులు లేవని పురుగుల మందు తాగి..!

by  |
మందుకు డబ్బులు లేవని పురుగుల మందు తాగి..!
X

దిశ, బెజ్జూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని బెజ్జూర్ మండలం కేంద్రంలోని ముంజంపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకోగా శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. బెజ్జూర్ ఎస్‌ఐ సాగర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సుభాష్ (37) తాగుడుకు బానిసయ్యాడు. మద్యం కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతుని భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.


Next Story

Most Viewed