నిన్న సంజయ్.. నేడు అజయ్ దేవగన్

by  |
నిన్న సంజయ్.. నేడు అజయ్ దేవగన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటిన బాలీవుడ్ హీరో.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్‌వై ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. తన మనసుకు దగ్గరైన ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాము నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను భాగం చేస్తామని.. ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపిన దేవగన్.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా సంజయ్ దత్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed