ఆర్థిక సాయం చేసిన ఏఐటీయూసీ

by  |
ఆర్థిక సాయం చేసిన ఏఐటీయూసీ
X

దిశ, మహాబూబ్‌నగర్: కరోనా కాలంలో అనారోగ్యం కారణంగా ఆకాలమరణం చెందిన అసంఘటిత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. అకాల మరణం పొందిన 3 బాధిత కుటుంబాలను కలిసి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కరోనా సమయంలో కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని సంపన్నులకు అందించిన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.



Next Story

Most Viewed