ఐశ్వర్య ఎమోషనల్ అయింది : అభిషేక్

by  |
ఐశ్వర్య ఎమోషనల్ అయింది : అభిషేక్
X

అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బ్రీత్ ఇన్ టు ది ఎయిర్’. జులై 10న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని తెలిపారు అభిషేక్. ఒక్కరైతే లాప్ టాప్, సెల్ ఫోన్‌లో చూస్తూ ఎంజాయ్ చేయొచ్చని తెలిపారు.

ఐశ్వర్య రాయ్ వారం రోజుల కిందటే ఈ సిరీస్ చూసి, చాలా ఎమోషనల్ అయిందన్నారు జూనియర్ బచ్చన్. నాన్న అమితాబ్ బచ్చన్‌తో పాటు కుటుంబం మొత్తం ఈ సిరీస్‌ను ఎంజాయ్ చేశారని తెలిపారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

నిత్యా మీనన్‌కు ఇది తొలి వెబ్ సిరీస్ కాగా, తప్పిపోయిన కూతురును కనుగొనే క్రమంలో ఎదురయ్యే సంఘటనలే దీనికి కథా నేపథ్యం.



Next Story

Most Viewed