- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : విమాన సేవల పునరుద్ధరణపై వదంతులు ప్రచారమవుతున్నాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వివరాలు వైరల్ అవుతున్నాయని, వాటి ఆధారంగా కొన్ని మీడియా సంస్థలూ తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ వైమానిక సేవల పునరుద్ధరణపై నిర్ణయాలు ఎయిర్ ఇండియా పరిధిలో ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్స్ తీసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేశాకే, అందుకు అనుగుణంగా టికెట్ బుకింగ్స్ స్వీకరిస్తుందని క్లారిటీ ఇచ్చింది. తప్పుడు వార్తల నుంచి దూరంగా ఉండాలని ప్రయాణికులకు హెచ్చరిస్తూ.. ఈ సేవల పునరుద్ధరణపై అధికారిక ప్రకటనల కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా ట్విట్టర్ ఖాతా, సంబంధిత వెబ్సైట్లను ఫాలో కావాలని సూచించింది.
Next Story