ఫుల్‌గా తాగి వేరే ఇంట్లో దూరిన మాజీ ఎంపీ.. తర్వాత ఏమైందంటే.?

by  |
ఫుల్‌గా తాగి వేరే ఇంట్లో దూరిన మాజీ ఎంపీ.. తర్వాత ఏమైందంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఏకంగా పార్లమెంట్‌కే ఎన్నికైన సీనియర్ నాయకుడు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా పీకలా దాకా తాగి వేరే ఇంట్లోకి వెళ్లడంతో వారు ఆయనపై దాడి చేశారు. అనంతరం ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే.. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్.

వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు మద్యం సేవించిన గోపాలకృష్ణన్ పొరపాటున నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి యజమాని గోపాలకృష్ణన్‌పై దాడి చేశాడు. అనంతరం ఆయనపై పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే తమకు ఆయన మాజీ ఎంపీ అనే విషయం తెలియదని సదరు ఇంటి యజమాని తెలిపారు.

కాగా.. గోపాలకృష్ణన్ 2014-19 కాలంలో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంత జరిగినా గోపాలకృష్ణన్ మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పడం విశేషం.

Read More Interesting News

సెల్‌ఫోన్‌లో భార్య చిలిపి పని.. అది చూసిన భర్త షాకింగ్ డెసిషన్

ఆ హీరో వల్లే నేను పెళ్లిచేసుకోలేదు.. నటి టాబు షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed