- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్నగర్: తెలంగాణలో నేడు రైతు ప్రభుత్వం నడుస్తుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నేడు ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుటిందన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని లహారి గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యచరణ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ర్టంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. రైతులు కూడా ప్రభుత్వం సూచించిన విధంగా చెప్పిన పంట వేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. ఈ సదస్సులో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.