ఇది ప్రజాస్వామ్యమా.. దాదాగిరీనా?

by  |
Minister Niranjan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నాయకులపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని హెచ్చరించారు. రాష్ట్రాలను బెదిరిస్తూ.. దేశ వ్యాప్తంగా బీజేపీ రాజకీయ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ’’ఇది ప్రజాస్వామ్యా..? దాదాగిరీనా?‘‘ అని ప్రశ్నించారు. రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నులనే కేంద్రం తిరిగి ఇస్తుందని గుర్తుచేశారు. అంతేగాకుండా బీజేపీకి తెలంగాణలో అధికారం ఇస్తే.. రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని తెలిపారు.

Next Story

Most Viewed