ఏపీలో గాలిలోనే చక్కర్లు కొడుతున్న విమానాలు

by  |
ఏపీలో గాలిలోనే చక్కర్లు కొడుతున్న విమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడలోని గన్నవరం ఏయిర్ పోర్టులో భారీగా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా క్లియరెన్స్ రాక విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి.

ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన విమానం గాలిలోనే తిరుగుతున్నట్లు ఏయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. పొగమంచు క్లియర్ అయ్యాక విమానాల ల్యాండింగ్‌‌కు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, గమ్యస్థానానికి చేరుకున్నా విమానం ల్యాండింగ్ కాకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed