- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబాబాద్ టౌన్: అనాథల సంక్షేమం కోసం ఆశ్రమాన్ని నిర్వహించడం మానవీయతకి ప్రత్యక్ష నిదర్శనమని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష పేర్కొన్నారు. గురువారం జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినాతో జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం కాలనీలో దైవ కృప అనాథాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోని సందర్భంలో దిక్కు మొక్కు తెలియని వారిని అక్కున చేర్చుకుని వారి ఆలనా పాలనా చూడడం చాలా మంచి పరిణామం అన్నారు. అనాథాశ్రమం నిర్వహిస్తున్న లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. లోకేష్ స్వదార్ గృహం కోసం దరఖాస్తు చేసుకోగా పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అన్ని రకాల వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సుంకర లేని నాగమణి పాల్గొన్నారు.