విడాకుల అనంతరం ఫస్ట్ టైం అక్కడికి వెళ్లిన సమంత.. రీజన్ అదేనా.?

by  |
విడాకుల అనంతరం ఫస్ట్ టైం అక్కడికి వెళ్లిన సమంత.. రీజన్ అదేనా.?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ చై-సామ్ ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని చైతూ-సామ్.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.

ఇదిలా ఉండగా.. విడాకుల అనంతరం సమంత తీర్థయాత్రలో బిజీగా ఉంది. ఆమె తన ఆరుగురు స్నేహితులతో కలిసి గురువారం ఉత్తరాఖండ్​ వెళ్లింది. గురువారం రాత్రి గంగ్రోతిని దర్శించుకున్నారు. శుక్రవారం హెలీకాప్టర్‌లో కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల టెంపుల్స్‌ను సందర్శించారు. తిరిగి సాయంత్రానికి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయారు. సామ్ విడాకుల అనంతరం ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో జర్నీ చేస్తూ రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed