తమిళ్ పాలిటిక్స్.. కమల్‌హాసన్ పై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

by  |
తమిళ్ పాలిటిక్స్.. కమల్‌హాసన్ పై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే తమిళ రాజకీయాలు ‘కూటమి’ పాలిటిక్స్‌గా డివైడ్ అయ్యాయి. వచ్చే ఎన్ని్కల్లో గెలుపు మాదంటే మాదే అని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ నాయకులు, నటి ఖుష్బూ అన్నాడీఎంకే- బీజేపీ పొత్తుపై స్పందించారు. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమిదే గెలుపు తథ్యం అని స్పష్టంచేశారు.

అదే విధంగా ‘మక్కల్ నిధి మయ్యమ్’ పార్టీ అధినేత కమల్ హాసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ-అన్నాడీఎంకే మ్యానిఫెస్టోలోని హామీలను కమల్ తప్పుపట్టాల్సిన అవసరం లేదని.. థౌజండ్ లైట్స్‌లో తెలుగువారి నుంచి స్పందన లభిస్తుందన్నారు. రజినీకాంత్‌ను కూడా తనకు ఓటు వేయాలని అడుగుతానని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed