మరోసారి లీకైన నటుడు పృథ్వీ ఆడియో.. అప్పుడు వెనకనుంచి.. ఇప్పుడు ముందునుంచి

by  |
మరోసారి లీకైన నటుడు పృథ్వీ ఆడియో.. అప్పుడు వెనకనుంచి.. ఇప్పుడు ముందునుంచి
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మా ఎలక్షన్స్ అగ్గి రాజేస్తున్నాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న ఈ ఎలక్షన్స్ పైనే అందరి చూపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచు విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మా ఎలక్షన్స్ పై చిత్ర పరిశ్రమలో ఎవరికి తగ్గ అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు. ఇటీవలే దర్శకుడు రవిబాబు మన సంఘాన్ని నడపడానికి పక్క రాష్ట్రం వాడు కావాలా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇక తాజాగా టాలీవుడ్ కమెడియన్, నటుడు పృథ్వీ రాజ్, మా ఎలక్షన్స్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇటీవల మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న పృథ్వీ, వైసీపీ కార్యకర్త, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడితో జరిపిన ఫోన్ సంభాషణ ఇప్పుడు టాలీవుడ్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ప్రకాశ్ రాజ్ విజయవాడ వెళ్లగా, అక్కడ ఆయనను పలువురు సన్మానించారు. ఇక ఆ సన్మానం తనకు నచ్చలేదని పృథ్వీ ఆ ఆడియోలో చెప్పారు. అంతేకాకుండా దేశంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుంది కానీ, పాలించే హక్కు మాత్రం ఉండదని తెలిపారు. తెలుగు నటులు ఇంతమంది ఉండగా, ఎక్కడినుంచో వచ్చిన ఆర్టిస్టులను సన్మానించడం బాధగా ఉందని, పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడిని మన ఎన్నికల్లో ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు.

తాను కన్నడలో ఒక సినిమా కోసం ఆడవేషం వేస్తే.. విగ్గు పీకేసి.. ఇక్కడ కన్నడ వాళ్లు మాత్రమే నటించాలి అంటూ అవమానించారని, ఆ అవమానంతో తనకు చచ్చిపోవాలనిపించిందని తెలిపారు. ప్రకాశ్ రాజ్ కి క్రమశిక్షణ లేదని, ఆయనను అందుకే రెండు సార్లు సస్పెండ్ చేసారని, అలాంటివాడికి సపోర్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఆడియో ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అప్పట్లో పృథ్వీ ఆడియో లీక్ అవ్వడం పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెల్సిందే.. ఇప్పడు మరోసారి ఈ మా ఎలక్షన్స్ గురించి ఆయన మాట్లాడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. మొన్నేమో వెనకనుంచి.. ఇప్పుడేమో ముందునుంచి మాట్లాడుతున్నాడు అంటూ సైటైర్లు వేస్తున్నారు.

158 మందితో న్యూడ్ కాల్స్.. ‘రెచ్చిపోయిన’ యువకులు


Next Story

Most Viewed