ఫ్లాష్.. ఫ్లాష్.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. ఇది వారిపనేనా ?

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. ఇది వారిపనేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు, విమర్శలు గుప్పించినప్పటి నుంచి వైసీపీ నేతలకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వ్యవహారంలోకి పోసాని కృష్ణమురళి ఎంటరై పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. పోసాని వ్యాఖ్యలపై ఓ వైపు జనసేన కార్యకర్తలు, మరో వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా పోసాని ఇంటిపై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. అమీర్ పేట్‌లోని ఎల్లారెడ్డిగూడలో పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేయడంతో భయాందోళనకు గురైన వాచ్ మెన్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఎనిమిది నెలలుగా పోసాని వేరే ఇంటిలో నివాసం ఉంటున్నారు.. సమాచారం తెలుసుకున్న పోసాని తన ఇంటికి చేరుకుని సంజీవరెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. పోసాని ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

జనసేన అభిమానులే కారణమా ?

పోసాని ఇంటిపై దాడి చేసిన దుండగులు జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానుల లేక మరెవరైనా ఉన్నారా.. అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల పోసాని మురళి కృష్ణ పవన్ కుటుంబంపై మాట్లాడడం పవన్ పోసాని పై మాట్లాడడం వీరి ఇద్దరి మధ్య రోజుకో మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో సమయంలో పోసాని ఇంటిపై దాడి చేయడం పట్ల ఎస్ ఆర్ నగర్ పోలీసులు. ప్రత్యేక నిఘా పెట్టారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేసినట్లు. విశ్వసనీయ సమాచారం.

ఎస్సార్ నగర్, పోలీసులు అన్వేషణ..

శ్రమదానానికి అనుమతి నిరాకరణ.. తగ్గేదే లే అంటోన్న జనసేన


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed