'పవన్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్.. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్'

by  |
Manchu Vishnu
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో తాను, పవన్ కల్యాణ్ స్టేజ్ కింద మాట్లాడుకున్నామని ‘మా’ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. పవన్, తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నాడు. ప్రకాష్ రాజ్ హ్యాపీగా సిసీటీవీ ఫుటేజ్ చూసుకోవచ్చని, ఆయన ప్యానెల్ సభ్యుల్లో ఒక్కరినుంచే తనకు రాజీనామా లేఖ వచ్చిందన్నాడు. తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, పోస్టల్ బ్యాలెట్లను తమ ఇద్దరితోనే సెపరేట్ చేయించారని విష్ణు తెలిపాడు.

ప్రకాష్ రాజ్ టీమ్‌కి నెక్ట్స్ టైమ్ బెటర్ లక్ అని విష్ణు స్పష్టం చేశాడు. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే తాను గెలిచినట్లు ప్రకాష్ రాజ్ చెప్పాడని, బ్యాలెట్ బాక్సుల్లో ఏం తేడా జరిగిందో ఆయనకే తెలియాలన్నాడు. ఎన్నికల సమయంలో రెండువైపులా చిన్న చిన్న సంఘటనలు జరిగాయని, మోహన్ బాబు, చిరంజీవి మాట్లాడుకున్నారని తెలిపాడు. బైలాస్ మారుస్తామని, వచ్చే ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ పోటీ చేయవచ్చని విష్ణు సూచించాడు.


Next Story