- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ‘ఆచార్య’ సెట్పై ఎన్నో వార్తలు వచ్చాయి. రూ. 20 కోట్లతో సెట్ వేశారని, చాలా అద్భుతంగా ఉంటుందని మీడియా ప్రచారం చేసింది కానీ, సెట్ వ్యూ మాత్రం బయటకు రాలేదు. ఈ క్రమంలోనే సెట్కు ముగ్ధుడైన హీరో చిరంజీవి ప్రేక్షకులకు ‘టెంపుల్ టౌన్’ను పరిచయం చేస్తూ వీడియో షేర్ చేశాడు. 20 ఎకరాల్లో వేసిన ఈ సెట్ ఇండియాలోనే అతిపెద్దది అని.. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని తెలిపాడు. గాలి గోపురాన్ని అద్భుతంగా మలిచిన తీరుకు ఫిదా అయిన చిరు.. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఓ ఉదాహరణ అని ప్రశంసించారు. నిజంగానే ఓ టెంపుల్ టౌన్లో ఉన్నామనే ఫీలింగ్ను తీసుకొచ్చిన కళాదర్శకులు సురేశ్, అద్భుతంగా విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివ, భారీగా ఖర్చుపెట్టి సెట్ వేయించిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ను అభినందించారు చిరు.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn't stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021