‘మహానాడులో కుట్ర.. ఆధారాలు ఉన్నాయి’

by  |
‘మహానాడులో కుట్ర.. ఆధారాలు ఉన్నాయి’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సిన్హా డిశ్చార్జ్ పిటిషన్ల పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. 2015లో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు భారీ కుట్ర పన్నారని ఏసీబీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి తోడు సండ్ర వెంకట వీరయ్య మాటల్లో అసలు వాస్తవాలు లేవని అధికారులు కోర్టుకు తెలిపారు. ఇందుకోసమే సండ్రాను కూడా అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. ఓటుకు నోటును రుజువు చేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. దీంతో ఈ కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed