అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ

by  |
అచ్చెన్నాయుడిని విచారిస్తున్న ఏసీబీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు‌ రెండో రోజు విచారిస్తున్నారు. విచారణకు ముందు ఆయనకు ఏండోస్కోపి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయనను జీజీహెచ్‌లోని పొదిలి ప్రసాద్ బ్లాక్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది, డాక్టర్ ఉన్నారు. వారి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా, నిన్న మూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఈఎస్ఐ స్కాంలో పలు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed