ఏపీకి ‘ఏసీఏ’ విరాళం రూ. కోటి !

by  |
ఏపీకి ‘ఏసీఏ’ విరాళం రూ. కోటి !
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కూడా మద్దతుగా నిలిచింది. ఈ మేరకు తమ వంతు సాయంగా 1 కోటి రూపాయలను బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు అందించింది. ఆన్‌లైన్ ద్వారా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్‌కు మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసి, సంబంధిత పత్రాలను ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కోశాధికారి గోపీనాథ్ సీఎం జగన్‌కు అందించారు. కరోనాపై పోరాటానికి ఇప్పటికే బీసీసీఐ కూడా కేంద్ర ప్రభుత్వానికి రూ.51 కోట్ల సాయం అందించిన విషయం తెలిసిందే.

Tags : Andhra Cricket Association, ACA, Coronavirus, Donations, YS Jagan


Next Story