దారుణం : టైలరింగ్ షాప్‌లోకి వెళ్లి మహిళపై దాడి చేసిన యువకుడు.. చివరికి

by  |
దారుణం : టైలరింగ్ షాప్‌లోకి వెళ్లి మహిళపై దాడి చేసిన యువకుడు.. చివరికి
X

దిశ, ఎల్బీనగర్ : మహిళపై దాడి చేసి బంగారు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ పీఎస్ పరిధి‌లోని మన్సురాబాద్ సౌత్ ఎండ్ పార్క్ కాలనీలో ఏపీ, విజయనగరం జిల్లా నీలిమర్ల మండలానికి చెందిన 46 సంవత్సరాల మహిళ గత 13 ఏళ్లుగా విజయేశ్వరి అనే టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. కాగా, సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడు షాప్ లోకి వచ్చి మహిళపై దాడి చేసి 3.5 తులాల బంగారు పుస్తెల తాడు‌ను లాక్కుని పారిపోయారు. మహిళ ప్రతిఘటించినా దుండగుడు ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed