ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

by  |
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌‌లో సెల్ఫీ మోజుకు మరో యువకుడు బలైపోయాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం సాయంత్రం ఓ యువకుడు సెల్పీ తీసుకుంటూ బావిలో జారి పడ్డాడు. బావి నిండుగా నీళ్లు ఉండటంతో ఈత రాకపోవడంతో యువకుడు చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story