మహిళను హత్య చేసి పాతి పెట్టిన దుండగుడు

by  |
మహిళను హత్య చేసి పాతి పెట్టిన దుండగుడు
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వికారాబాద్ ఉద్యానవనంలో మహిళను దారుణంగా హత్య చేసి పాతి పెట్టాడు దుండగుడు. మృతురాలు ఎన్నెపల్లికి చెందిన నర్సమ్మగా గుర్తించారు. సదరు మహిళ కనిపించడం లేదని మ‌ృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాబయ్యను అనుమానించిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు బాబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed