బిగ్ బ్రేకింగ్.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా MRO

by  |
MRO-sunitha
X

దిశ, కాటారం : కొత్త పాసు పుస్తకం కోసం రూ. 3 లక్షలు లంచం అడిగి ఏసీబీకి ఓ మహిళా ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3లో 4.25 ఎకరాల భూమికి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని ఎమ్మార్వో మేడిపల్లి సునీతను రైతు ఐత హరికృష్ణ కోరాడు. ఇందుకు రూ. 3 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేయడంతో మొదట రూ. 50 వేలు ఇచ్చారు.

మిగతా డబ్బు కూడా ఇస్తేనే పాసు బుక్స్ ఇస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయిచారు. ఈ క్రమంలో గురువారం రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మహిళా ఎమ్మర్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

బాలికపై తాత, మామ దారుణం.. బ్రిడ్జికి శవం వేలాడడంతో గుట్టురట్టు

For Latest updates Follow Disha Facebook Official page : https://www.facebook.com/dishatelugunews

Next Story