ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఒకరు మృతి

by  |
ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఒకరు మృతి
X

దిశ, ఆదిలాబాద్: ఓ వైపు కరోనాతో ప్రజలు ఇప్పటికే ఆందోళనకు గురవుతుంటే మరోపక్క భానుడు కూడా భయాందోళనకు గురిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా చేతిలో పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను భానుడు బలిగొంటున్నాడు. వడదెబ్బతో ఉమ్మడి జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని లింగి గ్రామానికి చెందిన గాదేకర్ సాగర బాయి (46) అనే మహిళ శనివారం మృతి చెందింది. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లిన ఆమె వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.



Next Story

Most Viewed