ఢిల్లీలో జంట హత్యల కలకలం..

by  |

కొవిడ్-19 వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో దేశ రాజధాని దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన అత్తా మామలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీ చావ్లా ప్రాంతంలోని దుర్గా విహార్‌ ఫేజ్‌-2లోని తమ ఇంటిలో కవిత (35) అనే మహిళ.. తన అత్తమామలు రాజ్‌ సింగ్‌(61), ఓంవతి (58)లను దారుణంగా కొట్టి, ఆపై కసితీరా కత్తితో పొడిచి చంపిందని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భర్త సతీష్‌ సింగ్‌ (37)ను కూడా ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కవిత, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags: Delhi, Murder, Uncle, Aunty, Property issues


Next Story

Most Viewed