ప్లీజ్.. మా గ్రామంలోకి ఎవరూ రాకండి

by  |
ప్లీజ్.. మా గ్రామంలోకి ఎవరూ రాకండి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలో గ్రామస్తులు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. పదిహేను రోజుల పాటు లాక్‌డౌన్ అంటూ గ్రామపెద్దలు సోమవారం రాత్రి దండోరా వేయించారు. అంతేగాకుండా.. తమ గ్రామంలోకి ఈ పదిహేను రోజులు ఎవరూ రావొద్దని గ్రామస్తులు విజ్ఞప్తులు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed