కన్నతల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు

by  |

దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో నాందేవ్ అనే యువకుడు తల్లి లక్ష్మిబాయిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో ఆర్తనాదాలు పెడుతున్న లక్ష్మిబాయిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆదిలాబాద్‌ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా లక్ష్మిబాయి ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు జరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed