- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్/ కొత్తకోట: జాతీయ జెండాలు చేతబట్టి.. భారత్ మాతాకీ జై అంటూ.. దేశభక్తుల నినాదాలు దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో హోరెత్తాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 100 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు సైకిల్ యాత్ర చేస్తూ సోమవారం కొత్తకోటకు చేరుకున్నారు.
ఇదే సమయంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది యువత ఈ బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సీఆర్పీఎఫ్ బృందానికి స్వాగతం పలికి.. వారితో కలిసి కొంత దూరం సైకిల్ యాత్ర చేశారు. ఇదే యాత్రలో భారీగా తరలివచ్చిన యువత సీఆర్పీఎఫ్ బృందం పై పూల వర్షం కురిపించారు. అనంతరం కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్లో సైకిల్ యాత్ర చేస్తున్న జవాన్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, యువత పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.