సార్వభౌమ అవార్డు అందుకున్న సంఘ సేవకురాలు

by Shyam |   (  Updated:2020-06-09 03:06:44  IST  )

<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్షారం గ్రామానికి చెందిన &#8220;మీ కోసం మేము&#8221; అనే స్వచ్ఛంద సంస్థ సేవకురాలు శశికళకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డు తనలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. ఈ అవార్డుతో సంఘంలో సాటివారి పట్ల నిరాదరణకు గురవుతున్న అనాథలకు [&hellip;]</p>

సార్వభౌమ అవార్డు అందుకున్న సంఘ సేవకురాలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్షారం గ్రామానికి చెందిన “మీ కోసం మేము” అనే స్వచ్ఛంద సంస్థ సేవకురాలు శశికళకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డు తనలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. ఈ అవార్డుతో సంఘంలో సాటివారి పట్ల నిరాదరణకు గురవుతున్న అనాథలకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనకు సపోర్ట్ చేసిన శాలిని జాదవ్ కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Next Story