సార్వభౌమ అవార్డు అందుకున్న సంఘ సేవకురాలు

by  |
సార్వభౌమ అవార్డు అందుకున్న సంఘ సేవకురాలు
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్షారం గ్రామానికి చెందిన “మీ కోసం మేము” అనే స్వచ్ఛంద సంస్థ సేవకురాలు శశికళకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సార్వభౌమ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో వచ్చిన అవార్డు తనలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు. ఈ అవార్డుతో సంఘంలో సాటివారి పట్ల నిరాదరణకు గురవుతున్న అనాథలకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తనకు సపోర్ట్ చేసిన శాలిని జాదవ్ కు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed