ముంబైలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. 9మందికి గాయాలు

by  |
ముంబైలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్‌.. 9మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి 9 మంది కార్మికులు గాయపడ్డారు. వివరాలలోకి వెళితే.. ముంబై నగరంలోని బాండ్రా కుర్లా కాంప్లెక్సు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ శుక్రవారం ఉదయం 4:40 నిమిషాల ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. పెద్ద శబ్దం రావడం తో గాఢనిద్రలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా..? అని రెస్క్యూ సిబ్బంది అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శాంతాక్రజ్ లోని వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


Next Story

Most Viewed