మిర్యాలగూడకు చేరుకున్న ప్రకృతి ప్రేమికుడి సైకిల్ యాత్ర

by  |
cycle-trip
X

దిశ, మిర్యాలగూడ: పర్యావరణ హితం కాంక్షిస్తూ మహారాష్ట్రకి చెందిన ప్రకృతి ప్రేమికుడు విశాల్ చేస్తున్న సైకిల్ యాత్ర శుక్రవారం మిర్యాలగూడకు చేరుకుంది. విశాల్ సైకిల్ యాత్రకు ఆర్టీసీ డీఎం పాల్ తన సిబ్బందితో కలిసి స్వాగతం పలికి సన్మానించారు. 28 రాష్ట్రాల మీదుగా విశాల్ చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ సమతుల్యతను అందించడం మనందరి బాధ్యతని, కాలుష్య నివారణకు చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సంధ్యరాణి, ఎఎఫ్ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed